Election Updates: నేడు విశాఖలో 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం

Election Updates: Development works worth 1500 crore rupees will be launched in Visakhapatnam today
Election Updates: Development works worth 1500 crore rupees will be launched in Visakhapatnam today

ఇవాళ విశాఖలో 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్ గా 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు CM జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ముడసర్లోవలో 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ GVMC నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు.

98 కోట్లతో అభివృద్ధి చేసిన పాలిటెక్నిక్, ఐటీఐలను ప్రారంభించనున్నారు CM జగన్‌. రూ.10 కోట్లతో టర్టెల్ బీచ్, వెంకోజీ పాలెం నుంచి మారియట్ హోటల్ జంక్షన్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం, కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మధురవాడ ప్రాంతానికి నీటి సరఫరా ప్రాజెక్ట్ CM జగన్ శ్రీకారం చుట్టనున్నారు. అటు ‘విజన్ విశాఖ’ కార్యక్రమం సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో ‘విజన్ విశాఖ’ సమావేశం జరుగనుంది.