Election Updates: రాష్ట్ర క్యాడర్ IAS, IPSలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించిన ఈసీ

Election Updates: EC appointed state cadre IAS, IPS as special observers
Election Updates: EC appointed state cadre IAS, IPS as special observers

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిట్ అధిపతిగా ఉన్న కొల్లి రఘురామ్రెడ్డిని గువాహటి లోక్సభ స్థానానికి ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించింది. ఆయన ఏప్రిల్ 19 నుంచి మే 7వ తేదీ వరకూ ఆ బాధ్యతల్లో ఉంటారు. రఘురామ్రెడ్డి వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఆయనను బదిలీ చేయాలని విపక్షాలు కొంతకాలంగా కోరుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర క్యాడర్కు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈసీ వివిధ ప్రాంతాలకు ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. అందులో 16 మంది IPSలను ప్రత్యేక పోలీసు పరిశీలకులుగా, 17 మంది IASలను ప్రత్యేక సాధారణ పరిశీలకులుగా పంపింది.