Election Updates: కరణం ధర్మ శ్రీకి వైకాపా నాయకుల షాక్.. తెదేపాలోకి 2 వేల మంది

Election Updates: Karanam Dharma Sriki Vaikapa leaders' shock.. 2 thousand people join TDP
Election Updates: Karanam Dharma Sriki Vaikapa leaders' shock.. 2 thousand people join TDP

అనకాపల్లి జిల్లా బుచ్చెయ్య పేట మండల వైకాపా నాయకులు.. విప్ కరణం ధర్మ శ్రీకి షాకిచ్చారు. చోడవరం నియోజకవర్గంలో ఇన్నాళ్లు ధర్మశ్రీకి వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలు సుమారు 2 వేల మంది తెదేపాలో చేరారు. ఒకేసారి అంతమంది ర్యాలీగా చోడవరంలోని తెదేపా కార్యాలయానికి చేరడంతో పట్టణంలో జనసం దోహం కనిపించింది.

తెదేపాలో చేరిన వారిలో విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్య నారాయణ, సర్పంచులు గేదెల వెంకయ్యమ్మ (కోమళ్లపూడి), గౌరమ్మ (గంటికొర్లాం), వేపాడ మనీషా (ఎల్.శింగవరం), నైదాన రాజు (గొర్లెపాలెం), ఎంపీటీసీ సభ్యులు దేవర అప్పారావు (కె.పి.అగ్రహారం), ఒడుగొండు దేవి (పొట్టి దొరపాలెం), పాతాళ శ్రీను (బుచ్చెయ్య పేట), నీలకంఠపురం, ఆర్.బీమవరం, ఆర్.శివరామపురం, పెదమదీనా పాల సంఘాల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, విద్యా కమిటీ ఛైర్మన్లు, గ్రామ నాయకులు ఉన్నారు. వీరందరికీ కూటమి అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లు నాయుడు సమక్షంలో బుచ్చెయ్య పేట మండల తెదేపా అధ్యక్షుడు గోకివాడ కోటేశ్వరరావు కండువాలు కప్పారు.