Election Updates: ఏపీ ప్రజలకు మోదీ విజ్ఞప్తి.. ఇవి మనసులో పెట్టుకుని ప్రజలు ఓటేయాలి

National Politics: This decade is just a trailer.. The real scene is ahead: Prime Minister Modi
National Politics: This decade is just a trailer.. The real scene is ahead: Prime Minister Modi

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రెండు సంకల్పాలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రెండు సంకల్పాలలో ‘తొలి సంకల్పం కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం. రెండో సంకల్పం ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం అని పేర్కొన్నారు. ఇవి మనసులో పెట్టుకుని ప్రజలు ఓటేయాలి అని కోరారు.

జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేస్తోంది అని ఆరోపించారు . ఎన్డీఏ సర్కారును గెలిపిస్తే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా’ అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే.. ఇక్కడ ఎన్డీఏ గెలవాలి అని తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుంది. అందుకే ఏపీలో ఎన్డీఏ గెలవాలి’ అని ఆకాంక్షించారు.