నేడు నాలుగో రోజు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు, బషీర్ బీబీ దర్గా దర్శనం పవన్ కళ్యాణ్ చేసుకుంటారు. అనంతరం నియోజకవర్గ మహిళలతో ప్రత్యేక సమావేశం లో పాల్గొననున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పిఠాపురం లో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలకు సన్మానం చేయనున్నారు పవన్.
కాగా నన్ను, సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయన్నారు. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటాను… నేను దేవుడిని నా గురించి ఎప్పుడూ ఏమీ అడగలేదని వెల్లడించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.






