కూకట్ పల్లి రేసులో ఏపీ కాంగ్రెస్ నేత…రంగం సిద్దం…!

Eluru Ramachandra Reddy Decided To Contest From Kukatpally

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంత సెటిలర్ ఓటర్లు అధికంగా ఉన్నారు. దాంతో ఈ సీట్లలో పోటీ చేసేందుకు ఆంధ్ర నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కూడా కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిసి ఈ విషయమై చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోండు.

pedhi-reddy-ram-chandraredd
రాహుల్ గాంధీకి సన్నిహితంగా మెలిగిన అయన 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. కానీ ఏపీ విడిపడిన వేవ్ కలిసి రాకపోవడంతో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి చెప్పుక్కోదగ్గ స్థాయిలో వోటర్లను ప్రభావితం చేసారు. అయితే తాజాగా కూకట్‌పల్లి నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్న ఏలూరి కచ్చితంగా తనకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇదే నియోజకవర్గం టికెట్ కోసం మహాకూటమి తరుపున విశ్వప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత ఇనగాల పెద్దిరెడ్డి.
అయితే సిటీలోని కొన్ని నియోజకవర్గాల్లో సెటిలర్స్ కె టికెట్ ఇవ్వాలని పీసీసీకి సూచిస్తున్నారట రాహుల్ గాంధీ. అందులో భాగంగా పైన పేర్కొన్న మూడు నియోజకవర్గాలను సెటిలర్స్ కు, అదికూడా కాంగ్రెస్ నేతలకే ఉండాలని ఆదేశించారట. దాంతో ఏలూరి రామచంద్రారెడ్డి ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతగా, పారిశ్రామిక వేత్తగా కూకట్‌పల్లి ప్రజలకు అయన సుపరిచితమే. అయితే మహాకూటమి టికెట్ ఏలూరి దక్కుతుందా లేక పెద్దిరెడ్డికా..? ఇద్దరు కాకుండా మరెవరైనా సీన్ లోకి వస్తారా అన్న విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

padhi-reddy