కాళ్లు మొక్కితేనే కలవనిస్తారా..?

EX MLA Sudheer Reddy controversial comments on CM KCR

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

EX MLA Sudheer Reddy Controversial Comments On CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధునిక నిజాంలా వ్యవహరిస్తారని ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అటు టీజేఏసీ నేత కోదండరాం కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వేదికే లేదని మండిపడుతున్నారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరింత ముందుకెళ్లి కేసీఆర్ ను లోతుగా టార్గెట్ చేశారు. కాళ్లు మొక్కినవారికే అపాయింట్ మెంట్ ఇస్తున్నారన్న మాట చర్చనీయాంశంగా మారింది.

సుధీర్ రెడ్డి చెప్పినదాంట్లో అంతా కాకపోయినా.. వాస్తవం అయితే ఉందని టీఆర్ఎస్ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. మొన్నటివరకూ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల సర్వేల పేరుతో హడావిడి చేస్తూ ఏదో తాను చెప్పాలనుకున్న నాలుగు మాటలు చెప్పేసి వాళ్లను పంపేస్తున్నారు. కానీ ఎక్కడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడం లేదనే మాట వినిపిస్తోంది.

కేసీఆర్ కంటే ముందు చాలా మంది సీఎంలు పనిచేసేవారు. కానీ వారందరితో జనంతో ఇంటరాక్ట్ కావడానికి ఏదో ఓ వేదిక ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలతో ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు టెలిఫోన్లో సామాన్యులతో మాట్లాడారు. ఇక వైఎస్ ప్రజాదర్భార్ నిర్వహించి సామాన్యుల్ని కలిసేవారు. కానీ కేసీఆర్ వచ్చాక వీఐపీలకు కూడా ఆయన దర్శనం దొరకడం దుర్లభమైపోయింది. ఇప్పటికే తీరు మార్చుకోకపోతే కేసీఆర్ ఒంటెద్దు పోకడలపై విమర్శలు ఉధృతమయ్యే అవకాశం ఉంది.

ఎవరీ దీపక్ రెడ్డి… జేసీ బ్రదర్స్ మేనల్లుడు మాత్రమేనా?

టీడీపీ లో భూప్రకంపనలు.