పంజాబ్ లో లాక్ డౌన్ పొడిగింపు

పంజాబ్ లో లాక్ డౌన్ పొడిగింపు

భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావం గట్టిగా ఉంది. రోజురోజుకీ కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే పంజాబ్ రాష్ట్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ లాక్ డౌన్ ను మరొక రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ అన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు.అయితే పంజాబ్ లో మే 3 వరకు లాక్ డౌన్ ఉండగా, ఆ తేదీ నుండి మరో రెండు వారాలు ఈ లాక్ డౌన్ పొడిగింపు ఉండనుంది.

అయితే ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా దాదాపు వెయ్యి మందికి పైగా మరణించారు. అందుకే కర్ఫ్యూ కారణంగా కేవలం నాలుగు గంటలకే సడలింపు ఉంటుంది అని వ్యాఖ్యానించారు.ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ప్రజలకు కావల్సిన నిత్యావసరాల షాపులు, దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే ఈ సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని, సనిటైజార్,మాస్క్ లని ఖచ్చితంగా ఉపయోగించాలి సూచించారు.