మరణ వార్త కంటే ఇది మరింత బాధ

Fans Feeling Very Sad About Incidents After Sridevi Death In Dubai

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆదివారం ఉదయానే టీవీలు పెట్టగానే శ్రీదేవి మరణ వార్త చూసి అంతా షాక్‌ అయ్యారు. నిన్న మొన్నటి వరకు కళ్ల ముందు తన అందమైన రూపంతో కదలాడిన శ్రీదేవి ఒక్కసారిగా కనుమరుగవ్వడం ఏంటని అభిమానులు గుండెలు అవిశేలా కన్నీరు పెట్టుకున్నారు. శ్రీదేవి ఇక తిరిగి రాదని తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందారు. ఇక రాదని తమ గుండెలను బండలుగా మార్చుకుంటున్న సమయంలో ఆమె మరణంకు సంబంధించిన విషయాలు కొన్ని అభిమానుల గుండెలను కోస్తున్నాయి. శ్రీదేవి మత్యం మత్తులో బాత్‌టబ్‌లో పడి ఊపిరి ఆడక మృతి చెందింది అంటూ దుబాయి పోలీసులు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో వెళ్లడైంది. 

పోలీసులు శ్రీదేవి మరణం గురించి చెబుతున్న వాస్తవాలు అభిమానులను కలవర పెడుతున్నాయి. శ్రీదేవి మరణ వార్త కంటే ఆమె మరణం గురించిన విషయాలు, మీడియాలో వస్తున్న పుకార్లు అభిమానుల మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. ఇక ఆమె మృత దేహం కూడా ఇండియాకు ఇప్పట్లో రాదని తెలిసిన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. తమ అభిమాన నటి ఎక్కడ మరణించడం, ఆమె మృతదేహం కూడా ఇండియాకు రావడానికి ఇబ్బందులు ఎదురు అవ్వడం వంటి విషయాలు సినీ పరిశ్రమ వారికి కూడా బాధను కలుగజేస్తున్నాయి. ఇండియాలో శ్రీదేవికి ఇలా జరిగి ఉంటే ఇప్పటి వరకు అభిమానులు ఆమె గురించి బాధపడటం, సాదారణ జీవితానికి అలవాటు పడటం జరిగి పోయేది. కాని దుబాయిలో అవ్వడం, మీడియాలో రకరకాలుగా వార్తలు రావడం జరుగుతుండటంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.