సికింద్రాబాద్ లో విషాదం, ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య

సికింద్రాబాద్ లో విషాదం, ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య
Suicide

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. భవనీనగర్ కాలనీలో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతోనే ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు…. ఆధారాలు సేకరిస్తున్నారు.

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో నివాసముండే శ్రీకాంత్ ఆచారికి, బోదంపోచంపల్లికి చెందిన అక్షయకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు శ్రావ్య, స్రవంతి ఉన్నారు. శ్రీకాంత్ సిల్వర్ వ్యాపారం చేస్తుంటాడు. రోజు మాదిరిగానే నిన్న రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి నిద్రించారు. ఉదయం శ్రీకాంత్ తో పాటు ఇద్దరు పిల్లు శ్రావ్య, స్రవంతి విగతజీవులుగా పడి ఉన్నారు. భార్య అక్షయ గమనించి కింది అంతస్థులో ఉన్న తన అత్తకు తెలిపింది.

సికింద్రాబాద్ లో విషాదం, ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య
శ్రీకాంత్ ఆచారి భార్య, పిల్లలు

దంపతుల మధ్య గతంలో ఎప్పుడు గొడవలు జరగలేదని స్థానికులు చెప్తున్నారు. భర్త పిల్లలు ప్రాణాలు తీసుకోవడం ఫై భార్య అక్షయ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో కలహాలు లేదంటే ఆర్థిక వ్యవహారాలు కారణమై ఉండవచ్చని అంటున్నారు. స్థానికుల సమాచారం తో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలను విచారిస్తున్నారు. శ్రీకాంత్ నిదురించిన ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రాధమికంగా అక్షయను ప్రశ్నించిన పోలీసులు మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది.