హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం

Financial assistance to Hajj pilgrims

సిద్దిపేటలో రూ.3.25 కోట్లతో ఆధునిక హంగులతో హజ్ హౌస్‌ను నిర్మిస్తున్నామని, ఈనెల 25న భవనాన్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మదీన ఫంక్షన్ హాల్‌లో ఆదివారం హజ్‌కు వెళ్లే యాత్రికులను ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని హజ్ యాత్రికులు ప్రార్థించాలని కోరారు. ఈ ఏడాది లక్షలాది మంది హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకుంటే కొంతమందికి మాత్రమే అవకాశం కలిగిందని చెప్పారు. అందులో సిద్దిపేట జిల్లాకు చెందిన 50 మంది ఎంపిక కావడం దైవ సంకల్పమన్నారు. ఏటా ఐదుగురు నిరుపేదలకు తన సొంత ఖర్చులతో హజ్ యాత్రకు పంపుతానని తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ ఖర్చు భరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.