ఇంధన బావిలో మంటలు: ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి….

అస్సాంలో ఘోరం చోటుచేసుకుంది. అస్సాంలోని ఇంధన బావిలో మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో కలకలం రేగుతోంది. అయితే ఆ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది  ఈరోజు  చనిపోయినట్లు గుర్తించారు. గత 14 రోజుల నుంచి టున్‌సుకియా జిల్లాలో ఉన్న ఓ ఇంధన పైపు లైన్‌ నుంచి గ్యాస్‌ లీకవుతూనే ఉంది. దీంతో మొదట ఇద్దరు ఫైర్‌ సిబ్బంది మాయమయ్యారు. ఆ తర్వాత వారి భౌతిక దేహాలను అధికారులు గుర్తించారు. భారీ స్థాయిలో ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ మంటలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద సుమారు 1.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంటల్ని ఆర్పేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

కాగా ఆయిల్‌ వెల్‌కు గ్యాస్‌ సరఫరా అవుతున్న సమయంలో అక్కడ ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ సహకరిస్తున్నాయి. పారామిలిటరీ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి పహారా కాస్తున్నాయి.