ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల

AP Politics: Good news for group 1 candidates in AP.. Extension of application deadline
AP Politics: Good news for group 1 candidates in AP.. Extension of application deadline

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. తాజాగా గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 566 జగన్‌ సర్కార్‌ విడుదల చేసింది .

ఫిబ్రవరి 25న గ్రూప్ -2 ప్రిలిమనరీ పరీక్ష జరుగనుంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. కాగా, ఏపీ సీఎం జగన్‌ మరో తీపికబురు చెప్పారు. పేద మహిళలకు ‘మహిళాశక్తి’ ఆటోలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్‌ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే, తొలి విడతలో పొదుపు సంఘాల సభ్యులైన 231 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు పంపిణీ చేయనున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 660 మందికి పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి మిగిలిన లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఆటో కొనుగోలు ఖర్చులో 90శాతం వడ్డీ లేని రుణం ఇవ్వనున్నారు. 48 నెలలు సమాన కిస్తీల్లో చెల్లింపులు చేయాలని అధికారులు ఆదేశించారు.