నైజాంలో “రజాకార్” కు మంచి రెస్పాన్స్.?

Good response to
Good response to "Rajakar" in Naijam.?

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన మూవీ లలో ఆల్మోస్ట్ అన్నీ కూడా మరీ అంత ఎక్కువ బజ్ తో వచ్చినవి లేవు. అయితే ఈ మూవీ ల్లో రిలీజ్ అయ్యాక మాత్రం ఆడియెన్స్ ను స్టన్ చేసిన మూవీ ఏదన్నా ఉంది అంటే అది రాజ్ అర్జున్, మార్కండ్ దేశ్‌పాండే, బాబీ సింహా, అనసూయ భరద్వాజ్, వేదిక లాంటి టాలెంటెడ్ నటీనటులు నటించిన మూవీ “రజాకార్” మూవీ నే అని చెప్పాలి.

ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి మౌత్ టాక్ ను సంతరించుకుంది. మెయిన్ గా నైజాం మార్కెట్ లో మంచి రెస్పాన్స్ ఈ మూవీ కి నమోదు అవుతున్నట్టుగా తెలుస్తోంది . అంతే కాకుండా ఇంత తక్కువ బజ్ లో వచ్చినప్పటికీ కూడా మౌత్ టాక్ మూలాన మొదటి 24 గంటల్లో ఈ మూవీ బుక్ మై షో లో 10 వేలకి పైగా టికెట్స్ ను బుక్ చేసుకుంది.

దీనితో ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ నే కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించగా తాను నిజ జీవితంలో జరిగిన కొన్ని దారుణ సంఘటనల ఆధారంగా ఈ మూవీ ని తెరకెక్కించారు. అలాగే భీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించగా గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణం వహించారు.