Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్బాబు, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్బాబు సీఎంగా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్తో సినిమాకు అనూహ్యంగా రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సందడి ప్రారంభం అయ్యింది. ఈ చిత్రం ఆడియోను వైజాగ్లో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరు అయ్యేందుకు వీలుగా వైజాగ్లో ఆడియో వేడుకను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఇటీవలే ‘రంగస్థలం’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ బీచ్లో భారీ ఎత్తున నిర్వహించారు. ఆ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఉంటుంది కనుక వైజాగ్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుందనే అభిప్రాయంతో నిర్మాతలు కూడా ఈ నిర్ణయానికి వచ్చారు. మహేష్బాబుకు కూడా వైజాగ్లో ఆడియో వేడుక చేయాలని ఉందని, అందుకే ప్రస్తుతం వైజాగ్లో అందుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘భరత్ అను నేను’ 150 కోట్ల లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రంగస్థలంకు వచ్చిన భారీ క్రేజ్ను ఈ చిత్రానికి కూడా తీసుకు వచ్చేందుకు అదే దారిలో ఈ చిత్ర ప్రమోషన్ను తీసుకు వెళ్తున్నారు. మరి ఇది ఎంత మేరకు సక్సెస్ అయ్యేనో చూడాలి.