నూతన ఎమ్మెల్సీ నవీన్ రావు స్నేహితుల గొప్ప మనసు

great heart friends of mlc naveenrao

మామూలుగా మన స్నేహితుడు చిన్న ఉద్యోగం సంపాదిస్తేనే పార్టీలతో సహా పండగ చేసుకునే రోజుల్లో కూడాతమ మిత్రుడు కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌ ఎమ్మెల్సీగా గెలిచాడని వారు పార్టీలు చేసుకోలేదు. పార్టీలకి, తర్వాతి రోజు ప్రకటనలకి పెట్టే ఖర్చంతా జనానికి ఉపయోగపడాలని అనుకున్నారు, అనుకున్నదే తడవుగా ఆ మొత్తాన్ని అంతా కోటి రూపాయలకు పైగా విరాళం రూపంలో సీఎంఆర్‌ఎఫ్‌కు ఇచ్చేసారు. నిన్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సెల్‌ ఇన్‌ ఫ్రా గ్రూప్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ఆదిత్య, శ్రీనివాస్‌ పెయింట్స్‌ ప్రతినిధి బి.శశికాంత్‌, వైభవి ప్రాజెక్ట్స్‌ ప్రతినిధి టి.ప్రహ్లాద్‌, నయన్‌ కన్‌స్టక్ష్రన్స్‌ ప్రతినిధి ఎన్‌.అవినాశ్‌ రావు, వాయు మీడియా ప్రతినిధి జి. నాగరాజు, వి.ఆర్‌.కె. ఇండస్ట్రీస్‌ ప్రతినిధి టి.పవన్‌ కుమార్‌, ఎస్‌.వి.కె ప్రాజెక్ట్స్‌ ప్రతినిధి మనోహర్‌ రెడ్డి, క్రెస్ట్‌ ఇంజినీరింగ్‌ ప్రతినిధి సీహెచ్‌ శ్రీనివాస్‌ రావు, సీహెచ్‌ పాండురంగారావు, రంజిత్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వారిని అభినందించారు. ఇలాంటి పనులను మిగతావారు కూడా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.