మాజీ మంత్రి కొడుకుపై కాల్పులు… షాక్ లో హైదరాబాద్.

Gun Firing On Vikram Goud

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీమంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ మీద ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో కాల్పులు జరిగాయి. విక్రమ్ నివాసంలోనే జరిగిన ఈ ఘటనతో ఆయనకు బులెట్ గాయాలు తగిలాయి. చేతిలోకి , పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. నెత్తురు ఆడుతున్న ఆయన్ని జూబిలీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన శరీరం నుంచి రెండు బుల్లెట్స్ బయటికి తీశారు. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

నిన్న అర్దరాత్రి టైం లో విక్రమ్ ఇంటికి వచ్చారట. తెల్లవారుజామున గుడికి వెళదామని భార్యకి చెప్పారట. రెడీ అయ్యి గుడికి బయలుదేరే సమయంలో గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరిగినట్టు విక్రమ్ గౌడ్ భార్య పోలీసులకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో కలకలం రేపిన ఈ కేసు విచారణ పోలీసులకి సవాలుగా మారింది. కేసులో కుట్రదారుల గుట్టు ఛేదించేందుకు 10 బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ టీవీ ఫ్యూటెజ్ ని పరిశీలిస్తున్నారు.

 మరిన్ని వార్తలు

వెంకయ్యని చూసి మోడీ ఏడ్చాడా ?

శ్రీవారి సన్నిధిలో అధికారుల చెలగాటం

నితీష్ అంటే రగిలిపోతున్న శరద్ యాదవ్