రానా తప్ప మరెవ్వరు ఆసక్తి చూపట్లేదు

gunasekhar-Hiranya-kashipu-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత హిరణ్య కశ్యపుడు అనే చిత్రాన్ని చేయాలని భావించాడు. అందుకోసం స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేశాడు. ఈ చిత్రం కోసం టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ హీరోలను గుణశేఖర్‌ సంప్రదించాడు. కొందరు కథ విన్న తర్వాత నో అంటే మరి కొందరు కథ వినకుండానే నో అన్నారు. దాంతో హిరణ్య కశ్యపుడు ఇక లేనట్లే అని అంతా భావిస్తున్నారు.

రెండు సంవత్సరాలుగా గుణశేఖర్‌ చేసిన ప్రయత్నం విఫలం అయ్యిందని అంతా భావిస్తున్న తరుణంలో రానా తాను ఆ చిత్రాన్ని చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో రానా ముఖ్య పాత్రలో హిరణ్య కశ్యపుడు చిత్రం సెట్స్‌ పైకి వెళ్లే రోజులు త్వరలోనే రాబోతున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. ఏ స్టార్‌ హీరో కూడా ఈ చిత్రాన్ని చేసేందుకు ముందుకు రాకపోవడంతో చేసేది లేక రానాతో ఈ చిత్రాన్ని చేయాలని గుణశేఖర్‌ ఫిక్స్‌ అయ్యాడు.