గుంటూరు కారం సాంగ్.. కుర్చీ తాతకు ఎంత డబ్బు ఇచ్చారో తెలుసా?

గుంటూరు కారం : కుర్చీ తాత గురించి ఒక పాట ఎంత డబ్బో తెలుసా?
Cinema News

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ పై కుర్చీ తాత షేక్ అహ్మద్ పాషా గారు స్పందించారు. ‘మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో నా డైలాగ్ ని పాటగా వాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఈ పాటలో ఒక్క స్టెప్ అయిన వేయాలని ఉంది.

కుర్చీ డైలాగ్ ని సినిమాలో వాడుకున్నామని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాతో ముందే చెప్పారు. అంతేకాక ఆర్థిక సాయం కూడా చేశారు’ అని కుర్చీ తాత చెప్పుకొచ్చారు . ఇక తన కుర్చీ డైలాగ్ ని సినిమాలో వాడుకున్నందుకు లక్ష రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు కుర్చీ తాత షేక్ అహ్మద్ పాషా.

గుంటూరు కారం : కుర్చీ తాత గురించి ఒక పాట ఎంత డబ్బో తెలుసా?
Guntur Karam Song

కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ తెగ వైరల్ అవుతోంది . శుక్రవారం విడుదలైన ఈ పాట ప్రోమోకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది . మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేష్, శ్రీలీల స్టెప్పులు అదిరిపోయాయి. ఫుల్ ఎనర్జిటిక్ గా మాస్ స్టెప్పులతో బాగా రఫ్ఫాడించారు. ఇక ఈ ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్ ని ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.