టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌..!

Jigarthanda Harish Shankar Telugu remake Two Heroes Siddharths Role

ఈమద్య కాలంలో టాలీవుడ్‌లో వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు తెరకెక్కుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. చిన్నా పెద్ద హీరోలు అంతా కూడా మల్టీస్టారర్‌ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. రాజమౌళి వంటి స్టార్‌ డైరెక్టర్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌తో మల్టీస్టారర్‌ చిత్రానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. తాజాగా నాగార్జున, నానిల ‘దేవదాస్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సమయంలోనే రామ్‌ మరియు దుల్కర్‌ సల్మాన్‌ లు హీరోలుగా ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ మూవీని స్రవంతి రవికిషోర్‌ ప్రారంభించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ఈమద్య వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆచిత్రంకు సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా మొదలు కాబోతున్నాయి. ఇదే సమయంలో రామ్‌ మరో మల్టీస్టారర్‌ మూవీలో కూడా నటించే అవకాశం కనిపిస్తుంది.

Harish Shankar And Ram & Sudhir babu

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘డీజే’ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమా రాలేదు. ‘డీజే’ చిత్రం విడుదలైన తర్వాత తాను ‘దాగుడు మూతలు’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అయితే దిల్‌రాజు బ్యానర్‌లో మల్టీస్టారర్‌గా ఆ చిత్రం రూపొందబోతుందని అంతా భావించారు. అయితే దిల్‌రాజు ఆ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడంతో స్వయంగా హరీష్‌ శంకర్‌ తన సన్నిహితులతో కలిసి నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతుంది. ఇక ఈ మల్టీస్టారర్‌లో సుధీర్‌బాబు ఒక హీరోగా ఫిక్స్‌ అయ్యాడు. ఇదే సమయంలో మరో హీరోగా రామ్‌తో చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే ఒక మల్టీస్టారర్‌కు కమిట్‌ అయిన రామ్‌ కాస్త సమయం కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. రెండు మూడు నెలల్లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది కనుక రామ్‌ అప్పటికి ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడనే టాక్‌ వినిపిస్తుంది.