రాజమండ్రిలో అర్ధరాత్రి పేలుడు.. ఇద్దరు మృతి !

Two Killed As Crackers Explode In Rajahmundry

రాజమండ్రిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. దీపావళి కోసం తయారుచేస్తున్న బాణసంచా ప్రమాదవశాత్తు పేలడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని లాలా చెరువు సమీపంలోని తాటాకు ఇంటిలో శుక్రవారం అర్ధ రాత్రి ఈ ఘటన జరిగింది. దీపావళి సామగ్రి తయారు చేస్తుండగా పేలుడు జరగడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.