మెగా హీరోల ‘దాగుడు మూతలు’

Harish Shankar's new film with megha heros

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘సుబ్రమణ్యం ఫర్‌సేల్‌’, ‘డీజే’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు హరీష్‌ శంకర్‌ తన తర్వాత సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనిలో బిజీ అయిపోయాడు. దిల్‌రాజు నిర్మాణంలోనే హరీష్‌ శంకర్‌ మరో సినిమాను చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. కథానుసారం ఈ చిత్రం ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ చేయాల్సి ఉందట. అలాగే ఈ చిత్రం కథ కోసం ఇద్దరు హీరోలు అవసరం ఉందని కూడా దర్శకుడు పేర్కొన్నాడు. ఇప్పటికే ‘దాగుడు మూతలు’ అంటూ టైటిల్‌ కన్ఫర్మ్‌ అయిన ఈ చిత్రాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఒక మల్టీస్టారర్‌ చిత్రంతో తెరకెక్కించబోతున్నాడు. 

‘దాగుడు మూతలు’ చిత్రంలో నాని మరియు శర్వానంద్‌లు నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరోలతో హరీష్‌ శంకర్‌ దాగుడు మూతలు ఆడబోతున్నట్లుగా తెలుస్తోంది. మెగా యువ హీరోలు సాయి దరమ్‌ తేజ్‌ మరియు వరుణ్‌ తేజ్‌లతో దర్శకుడు హరీష్‌ శంకర్‌ చర్చించడం, వారు ఓకే చెప్పడం, దిల్‌రాజు అగ్రిమెంట్‌ చేసుకోవడం కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు మెగా హీరోలు కూడా నిర్మాత దిల్‌రాజుపై అభిమానంతో, ఆయన తమకు సక్సెస్‌ ఇచ్చాడని, మళ్లీ ఆయన బ్యానర్‌లో చేస్తే తప్పకుండా మంచి సినిమాలో నటించామనే పేరు వస్తుందని భావిస్తున్నారు. అందుకే దిల్‌రాజు బ్యానర్‌లో హరీష్‌ శంకర్‌ మూవీ అనగానే ఇద్దరు మెగా హీరోలు ఒప్పేసుకున్నారు. మరి కొన్ని నెలల్లో సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి, పక్కా స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

సేఫ్‌ జోన్‌కు దగ్గర్లో బెల్లంకొండ మూవీ

పవన్‌25 గురించి ఫేక్‌ న్యూస్‌