భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు !

Patancheru fire accident

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు లో భారీ అగ్ని ప్రమాదం సంభవిచింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి.

తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ ఉండటంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించాయి. అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో మూడు కంపెనీలకు వ్యాపించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీల యజమాలు తెలిపారు.

కంపెనీలు ఉన్న ప్రదేశంలో నీటి కొరత ఉండటంతో సహాయక చర్యలకు ఆలస్యం అయింది. సమాచారం అందుకున్న 5 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.