మోడీ ఒక సుళ్లేంద్ర…ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు

Hero Prakash Raj Comments On Narendra Modi Over Kannada Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ వస్తున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ముందు నుండి కూడా మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. అందుకే తానూ ఏ రాయకీయపార్టీకి చెందిన వ్యక్తిని కాదు, నేను ఏ రాజకీయపార్టీలో చేరను గానీ బీజేపీ పార్టీకి మాత్రం వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తాను అని చెప్పి కన్నడ ఎన్నికల్లో బీజేపీకి గుబులు పుట్టిస్తున్నాడు ఆయన. అందులో భాగంగానే బిజెపికి వ్యతిరేకంగా కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన ప్రధాని మోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుపపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన మోడీపై కౌంటర్లు వేశాడు. కర్ణాటక ఎన్నికల నిమిత్తం ప్రచారం నిర్వహిస్తూ మోడీ, ఉత్తర కర్ణాటకలోని ముధోల్ కు చెందిన శునకాలు సైన్యంలో సేవలు అందిస్తున్నాయని, వాటిని చూసైనా కాంగ్రెస్ నాయకులు దేశ భక్తిని అలవరచుకోవాలి చెప్పారు. దానికి ప్రతిగా ప్రకాష్ రాజ్, మీకు ఓట్లు వేసేది శునకాలు కాదని, మనుషులు అని మోడీకి కౌంటర్ వేసాడు.

అదీ కాక ఆయన ప్రధాని మోడీకి ఒక బిరుదును ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని అబద్దాలతో సరికొత్త రికార్డు సృష్టించారంటూ ధ్వజమెత్తారు. గతంలో ఏ ప్రధానమంత్రీ చెప్పనన్ని అబద్ధాలు నరేంద్ర మోడీ చెప్పి సరికొత్త రికార్డు సృష్టించినట్లుగా వెల్లడించారు. అందుకే తాను సుళ్లేంద్ర అన్న బిరుదును ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ.. సుళ్లేంద్ర అంటే అర్థమేమిటో తెలుసా?. అబద్దాల కోరు. అదీ కాక అధికారం కోసం అన్ని రకాలుగా దిగజారిన ప్రధానిని దేశం నేడు చూస్తోందని. గాలి బ్రదర్స్‌ చేసిన తప్పులను క్షమించానని చెప్పడానికి బీఎస్.యడ్యూరప్ప ఎవరు? 15 సీట్ల కోసం వారిని క్షమించేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని, ఎదురు తిరిగే వారిని పాతాళానికి తొక్కేయడం మోడీకి వెన్నతోపెట్టిన విద్య అని ఘాటుగా విమర్శలు చేశారు.