కాగా ‘ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్’ సినిమా ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ముంబైలోని తన నివాసంలో బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వయసు 34 సంవత్సరాలు. ‘కై పో చే’ అనే సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం ‘చిచ్చోర్’. లాక్ డౌన్ తో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు సుశాంత్. అయితే కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని.. ఉరేసుకొని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సమాచారం. కాగా ఈ ఘటనతో ఒక్కసారిగా సినీపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంగి.