జగన్ పాదయాత్రలో అపశ్రుతి….జగన్ మీద తేనెటీగల దాడి

honey bees attacked jagan praja sankalpa yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడదవోలులో ప్రవేశించిన పాదయాత్ర ఈరోజు ఉదయం పెరవలి మండలం కానూరు కొండాలమ్మ గుడి వద్ద 183రోజు పాదయాత్ర ప్రారంభం అయ్యింది. అయితే కొండాలమ్మ గుడి వద్ద తేనెటీగలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జగన్ ఆ ప్రాంతం నుండి దాటి వస్తుండగా ఒక ఆకతాయి దగ్గరలో ఉన్న తేనెతుట్టె మీదకు రాయి విసరడంతో అవి రేగి ఒక్కసారిగా దాడి చేయడంతో జగన్‌ను వాటి బారి నుంచి స్థానికులు, సెక్యురిటి, పోలీసులు పక్కను తీసుకెళ్లారు.

జగన్ ని అయితే పక్కకి తీసుకెళ్ళారు గానీ అప్పటికే వాటి దాడితో సుమారు 50 మందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది గాయాలు అయిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఒక విలేఖరి తీవ్రంగా గాయపదినట్టుగా చెబుతున్నారు. ఈ విషయం మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.