పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ భారీ హిట్కు కొనసాగింపుగా ‘కల్కి 2’ రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్లో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉందట. ఆ కీలక పాత్ర క్లైమాక్స్లో ఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రలో తమిళ స్టార్ శింబు కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సర్ప్రైజ్ నిజమైతే, థియేటర్లలో ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ ఖాయమే.
ఇక సినిమా కొత్త షెడ్యూల్ కోసం భారీ స్థాయిలో ఓ గ్రాండ్ సెట్ను సిద్ధం చేస్తున్నారట. ఆ సెట్లో ఒక పవర్ఫుల్ యాక్షన్ సీన్ను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ కీలక సన్నివేశంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కూడా పాల్గొననున్నారట. ఇప్పటికే లాస్ట్ షెడ్యూల్లో అమితాబ్, కమల్ పాత్రలకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసినట్టు తెలుస్తోంది.
భారీ నిర్మాణ విలువలతో వైజయంతీ మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మరో ఆసక్తికరమైన టాక్ ఏంటంటే, ‘కల్కి సీక్వెల్’కు కర్ణ 3102 బీసీ అనే టైటిల్ను ఫిక్స్ చేస్తున్నారట.
అంతేకాదు, ఈ సీక్వెల్లో పురాణాల ఎలిమెంట్స్ మరింత బలంగా ఉండనున్నాయని సమాచారం. తొలి భాగం ఎండింగ్ను కర్ణుడి పాత్రపై ముగించిన సంగతి తెలిసిందే. అందుకే, ‘కల్కి 2’ కథ మొత్తం కర్ణుడి చుట్టూనే తిరగబోతుందనే అంచనాలు మరింత బలపడుతున్నాయి.
మొత్తానికి, కల్కి యూనివర్స్ మరింత విస్తృతంగా… మరింత ఘనంగా మారబోతోందన్న మాట
