స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం….తల నరికి పోలీస్ స్టేషన్ కు…!

Husband Chops Wife Head In Karnataka
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. భర్త స్నేహితుడితో ఏర్పడ్డ మామూలు ముఖ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. దాని పర్యవసానం ఒకరి ప్రాణాలను బలితీసుకోగా వారి పిల్లలు ఇప్పుడు దిక్కులేనివారయ్యారు. వివరాలలోకి వెళితే బెంగళూరు చిక్కమంగళూరు జిల్లాకు చెందిన సతీష్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 9 ఏళ్ల క్రితం రూప అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. డ్రైవర్‌ గా వచ్చే జీతం సరిపోవట్లేదని కుటుంబ జీవనం కష్టంగా ఉందని అజ్జంపురలో మాంసం దుకాణాన్ని ఓపెన్ చేశాడు. సతీష్‌కి అదే ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను రోజూ దుకాణానికి వస్తూ పోతుండేవాడు. సతీష్ భార్య రూప కూడా మాంసం దుకాణంలో ఉండేది. ఈ క్రమంలోనే సునీల్ రూపతో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరి మీదా సతీష్‌కి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబంలో గొడవలు వచ్చాయి.
bengulure-kills-wife
వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. స్థానికులు కూడా కల్పించుకుని రాజీ ప్రయత్నం చేశారు. అయినా రూప, సునీల్‌ల వ్యవహారంలో మార్పు లేదు. తాజాగా వారిద్దరినీ వర్ణించలేని స్థితిలో ఉన్నప్పుడు చూడడంతో సతీష్ పట్టరాని ఆగ్రహానికి గురయ్యాడు. కొడవలిని తీసుకుని సునీల్ మీదకి విసిరాడు. కానీ సునీల్ తప్పించుకుని పారిపోవడంతో అక్కడే ఉన్న భార్య రూప పై దాడి చేసి తలను నరికేశాడు సతీష్. అంతటితో ఆగక ఆగ్రహంతో ఆ తలను తీసుకుని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్జంపుర పోలీస్ స్టేషన్‌ కు అ తలను చేతితో పట్టుకెళ్ళి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సునీల్‌కు రూ.3 లక్షలు అప్పు చేసి ఇచ్చానని, నమ్మించి మోసం చేయడమే కాకుండా పచ్చని సంసారంలో నిప్పులు పోశాడని నాభార్యను నాక్కాకుండా చేశాడని శిక్ష పూర్తయిన తరువాత బయటకు వచ్చి సునీల్‌ను హతమారుస్తానని ప్రకటించాడు సతీష్. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
kills-husbend-wife