తాంత్రికుడి మాయలో పడి భార్యను చంపిన భర్త

husband who killed his wife

తాంత్రికుడి మాయలో పడిన ఓ వ్యక్తి అతడి లైంగిక కోరిక తీర్చాలంటూ భార్యను వేధించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదని ఆమెను దారుణంగా హత్య చేశాడు సదరు భర్త. దీంతో పోలీసులు తాంత్రికుడిని, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మాన్‌పాల్ అనే వ్యక్తికి సంత్‌దాస్‌ దుర్గాదాస్‌ అనే తాంత్రికుడితో పరిచయం అయింది. అతడి మాటల మాయలో పూర్తిగా మారిపోయిన మాన్‌పాల్ తాంత్రికుడు ఏం చెబితే అది చేసేవాడు. అలాగే ఎంతో డబ్బులు అతడికి సమర్పించుకున్నాడు. మాన్‌పాల్ పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చాడని నిర్ధారణ చేసుకున్న తాంత్రికుడు తన వక్రబుద్ధి చూపెట్టాడు. నీ భార్యతో ఓసారి గడపాలని ఉందని మాన్‌పాల్‌తో చెప్పాడు. దీనికి ఏమాత్రం సంకోచించని అతడు భార్యకు ఈ విషయాన్ని చెప్పాడు. భర్త మాటలతో షాకైన ఆమె దీనికి ఒప్పుకునేది లేదని చెప్పింది. దీంతో ఆమెను చంపేయాలని మాన్‌పాల్ నిర్ణయించుకున్నాడు. కుటుంబం వృద్ధి చెందాలంటే కొన్ని పూజలు చేయాలని భార్యకు చెప్పి శుక్రవారం సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తాంత్రికుడితో కలిసి భార్యను నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. తన తల్లిని హత్య చేస్తుండగా చూసిన కుమారుడు గ్రామానికి వెళ్లి స్థానికులకు సమాచారమిచ్చాడు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులిద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.