Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
If Allegations Proved I will leave Politics
వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో తెరవెనుక ఉండి రాజకీయాలను శాసించిన కేవీపీ….ఇప్పుడు మాత్రం పెద్దగా కార్యక్షేత్రంలో ఉన్నట్టు కనిపించటం లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తూ..టీడీపీపై విమర్శలు చేస్తుంటారు. చంద్రబాబు కేంద్రంగానే కేవీపీ విమర్శలు సాగుతుంటాయి. ఆ కోవలోనే ఇప్పుడు కూడా బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు కేవీపీ. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీరందరిస్తే..చంద్రబాబుకు తాను అపర భగీరథుడు అనే బిరుదు ఇప్పిస్తానని కేవీపీ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నానని టీడీపీ తనపై
దుష్ప్రచారం సాగిస్తోందని…ఈ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. 2004కు పోలవరానికి అడ్డుపడింది చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. అబద్దాలు అందంగా చెప్పగలిగే తెలివితేటలు చంద్రబాబు సొంతమని కేవీపీ విమర్శించారు. ఆర్థికశాస్ర్రంలో చంద్రబాబుకున్న ప్రావీణ్యతను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలని కేవీపీ సూచించారు. కేవీపీ విమరన్శలను పలువురు టీడీపీ వర్గాలు తప్పుపడుతున్నాయి. పోలవరం నిర్మాణం క్రెడిట్ చంద్రబాబుకు వెళ్తోందనే అక్కసుతోనే కేవీపీ ఇలా మాట్లాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా…చంద్రబాబు పోలవరం పూర్తిచేసితీరుతారని, రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని టీడీపీ నేతలు భరోసా ఇస్తున్నారు.