రెండో టీ20లోనూ గెలిచి,సీరీస్ సొంతం చేసుకున్న భారత్

India won the second T20 and won the series
India won the second T20 and won the series

ఐర్లాండ్ జట్టుపై టీమిండియా మరో టి20 మ్యాచ్ గెలిచింది.టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే.నిన్న డూబ్లిన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఏకంగా 33 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా జట్టు మొదటి బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.

ఆ తరువాత లక్ష్య చేతనకు దిగిన ఐర్లాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 33 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మూడు టి20 మ్యాచ్లో సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక టీమిండియా బ్యాట్స్మెన్లలో రుతురాజు గైక్వాడ్ 58 పరుగులు, సంజు శాంసన్ 40 పరుగులు అటు రింకు సింగ్ 38 పరుగులు చేయగా , బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్లు తలో రెండేసి వికెట్లు తీసి రాణించారు.