మార్కుల పోటీలో నెగ్గలేనేమో అని…ప్రాణం తీసుకున్న శ్రీ చైతన్య విధ్యార్ధి !

Inter Student Nithin commits suicide in Sri Chaitanya At Vijayawada

కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.తాజాగా చైతన్య కాలేజీలో మరో విద్యార్ధి అసువులు బాసాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నితిన్ అనే విద్యార్ధి ఆత్మ హత్య చేసుకున్నాడు. విజయవాడ గురునానక్ కాలనీ మయూరి క్యాంపస్ లో జరిగిన ఈ ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది. హాస్టల్ రూమ్ లోని ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. నితిన్‌ ఆత్మహత్యకి ముందు సూసైడ్‌ లెటర్‌ కూడా రాసినట్లు తెలుస్తోంది. అమ్మ, చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని తండ్రికి లేఖ రాశాడు.

విద్యార్థి స్వస్థలం కృష్ణా జిల్లాలోని మొగల్రాజుపురం అని తెలుస్తోంది. రోజంతా చదువుల్లో పడి మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టర్ కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి కారణంగా ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.