జనసేన మూడో లిస్ట్…నాగబాబుకు చోటు !

జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది. ఈ జాబితాలో ఒంగోలు లోక్ సభ స్థానంతోపాటు 13 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జగన్ పార్టీ నుంచి తాజాగా జనసేనలో చేరిన పాలకొల్లుకు చెందిన గుణ్ణం నాగబాబుకు పాలకొల్లు టికెట్ కేటాయించారు. వైఎస్ఆర్సీపీ పాలకొల్లు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా పని చేసిన ఆయన టికెట్ దక్కకపోవడంతో చివరి నిముషంలో సోమవారమే జనసేనలో చేరారు. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానంలో మార్పు చేసినట్టు జనసేన స్పష్టం చేసింది. షేక్ రియాజ్ గిద్దలూరు నుంచి పోటీ చేస్తారని ముందుగా ప్రకటించగా ఆయన ఒంగోలు నుంచి పోటీ చేస్తారని నిన్నటి లిస్ట్ లో పేర్కొంది. గిద్దలూరు నుండి భైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ పోటీ చేస్తారని స్పష్టం చేసింది.

లోక్ స‌భ అభ్య‌ర్థి

ఒంగోలు – బెల్లంకొండ సాయిబాబు

శాస‌న‌స‌భ అభ్య‌ర్థులు:

  1. టెక్క‌లి – క‌ణితి కిర‌ణ్ కుమార్
  2. పాల‌కొల్లు – గుణ్ణం నాగ‌బాబు
  3. గుంటూరు ఈస్ట్ – షేక్ జియా ఉర్ రెహ్మాన్
  4. రేప‌ల్లె – క‌మ‌తం సాంబ‌శివ‌రావు
  5. చిల‌క‌లూరిపేట – మిరియాల ర‌త్న‌కుమారి
  6. మాచ‌ర్ల – కె. ర‌మాదేవి
  7. బాప‌ట్ల – పులుగు మ‌ధుసూధ‌న్ రెడ్డి
  8. ఒంగోలు – షేక్ రియాజ్
  9. మార్కాపురం – ఇమ్మ‌డి కాశీనాథ్
  10. గిద్ద‌లూరు – బైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్
  11. పొద్దుటూరు – ఇంజా సోమ‌శేఖ‌ర్ రెడ్డి
  12. నెల్లూరు అర్బ‌న్ – కేతంరెడ్డి వినోద్ రెడ్డి
  13. మైదుకూరు – పందిటి మ‌ల్హోత్ర‌
  14. క‌దిరి – సాడ‌గ‌ల ర‌వికుమార్ (వ‌డ్డె ర‌విరాజు )