జనసేన తుది జాబితా వెల్లడి…చివరి రోజే ?

Pawan Kalyans JanaSena Kavathu On Dowleswaram Barrage Near Rajahmundry

ఏపీలో నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగియనున్న విషయం తెలిసిందే. అయితే, జనసేన పోటీచేస్తోన్న 140 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతల్లో 121 మంది అభ్యర్థులను ప్రకటించగా, మిగతా వాటికి చివరి నిమిషంలో పేర్లు ఖరారు చేసింది. మిగిలిన మూడు లోక్‌సభ, 19 శాసనసభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ పార్లమెంటు సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించినా, అక్కడ అనూహ్యంగా తన అభ్యర్థిని పవన్ ప్రకటించారు. ఆ పార్టీ తరఫున ముత్తంశెట్టి శ్రీనివాస్ పేరు ఖరారు చేశారు.

శాసనసభ అభ్యర్థులు
శ్రీకాకుళం జిల్లా
నరసన్నపేట- మెట్ట వైకుంఠం
విజయనగరం జిల్లా
విజయనగరం- పాలవలస యశస్వి

గజపతినగరం- రాజీవ్ కుమార్ తలచుట్ల

విశాఖపట్నం జిల్లా
నర్సీపట్నం- వేగి దివాకర్

గుంటూరు జిల్లా
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ‌
యర్రగొండపాలెం- డాక్టర్ గౌతమ్
కందుకూరు- పులి మల్లిఖార్జునరావు

కర్నూలు జిల్లా

ఆత్మకూరు- జి చిన్నారెడ్డి
బనగానపల్లి- సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం- సజ్జల సుజల
ఆలూరు- ఎస్ వెంకటప్ప

అనంతపురం జిల్లా

పెనుగొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మీ
పత్తికొండ- కేఎల్ మూర్తి
ఉరవకొండ- సాకే రవికుమార్
శింగనమల- సాకే మురళీకృష్ణ‌
పుట్టపర్తి- పత్తి చలపతిరావు

చిత్తూరు జిల్లా
చిత్తూరు- ఎన్ దయారామ్
కుప్పం- డాక్టర్ వెంకటరమణ

లోక్‌సభ అభ్యర్థులు
విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్
నరసరావుపేట- నయూబ్ కమాల్
హిందూపూర్- కరిముల్లా ఖాన్