మోదీతో కేసీఆర్ భేటీలో ఏమి జరిగింది ?

భారత ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇరువురు నేతలు 45 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా ప్రధానికి 11 వినతిపత్రాలను సమర్పించారని తెలుస్తోంది. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు, హైకోర్టు విభజన త్వరగా పూర్తి చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఆర్ధిక పరంగా చేయూతనివ్వాలని, నూతన జోన్ల విధానానికి ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా మోదీని కేసీఆర్ కోరారని సమాచారం.

cm kcr meet narendra modi

కొత్త సచివాలయం నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన బైసన్ పోలో మైదానాన్ని ఇవ్వాలని అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ, రాష్ట్రంలో ఒక ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారని తెలుస్తోంది. దీనికి తోడు ఐటీఐఆర్ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళేలా చూడాలని కోరారు. అంతేకాక, ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.