మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు

KE Krishnamurthy Challenge To Jagan

 KE Krishnamurthy Challenge To Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నంద్యాల గెలుపుపై అధికార పక్షంలో సడెన్ గా ధీమాగా పెరిగిపోయింది. చంద్రబాబు నేతలందరికీ ఎవరి బాధ్యతలు వాళ్లకు అప్పజెప్పడంతో టీడీపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. కానీ వైసీపీ మాత్రం అభ్యర్థిని ఎప్పుడో ప్రకటించినా.. ప్రచారంలో వెనుకబడిందనే వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే టీడీపీ మంత్రులు జగన్ తో మైండ్ గేమ్ మొదలుపెట్టారు.

నంద్యాలలో పసుపు జెండా ఎగరడం ఖాయమని, జగనే కాదు ఎవరూ తమని అడ్డుకోలేరని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సవాల్ విసిరారు. నంద్యాల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు నిధులిస్తున్నారని, ఇంత చేస్తున్న ఆయన్ను కాదని జగన్ ను ప్రజలు ఎలా నమ్ముతారని కేఈ ప్రశ్నించారు. పైగా జగన్ సీఎం కావడం కూడా కల్ల అని జోస్యం చెప్పారు.

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన జగన్ ప్రజలకేం చేస్తారని ఎద్దేవా చేశారు. అంతటితో వదలని కేఈ.. తమ పథకాలనే జగన్ కాపీ కొట్టి నవరత్నాలంటూ కొత్తగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటిదాకా పాదయాత్ర అంటూ లీకులిచ్చిన జగన్.. ఇప్పుడు నోరు తెరవడం లేదని ఎద్దేవా చేశారు. మొత్తం మీద ఉపఎన్నికలకు ఇంకా నెల రోజులు ఉండగానే.. అధికార పార్టీ నుంచి విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నలు వస్తున్నాయి.