మీవాళ్లు చంపేస్తారేమో…హత్యకు ముందు ప్రియురాలితో ఫోన్లో…!

Killed 23 Year Old Youth In Karimnagar District

కరీంనగర్ జిల్లాలో 23 ఏళ్ల యువకుడి పరువు హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది కచ్చితంగా హత్యేనని, ప్రేమించిన పాపానికి అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుమార్ ప్రియురాలు కూడా ఇదేమాట చెప్ప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి కుమార్ ఇంటర్ విద్యార్థినిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. అయితే ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో కుమార్‌ను ఆమె కుటుంబసభ్యులు పలు మార్లు హెచ్చరించారు. దీన్ని కుమార్ లెక్కచేయలేదు.
అంతేకాక అమ్మాయితో కలిసి ఈనెల 6న బస్సులో నిజామాబాద్‌లోని తమ బంధువుల ఇంటికి కుమార్ వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తాడికల్‌కు తిరిగి వచ్చాడు.

karim-nager-murder

మరుసటి రోజే అమ్మాయి కుటుంబ సభ్యులు తాడికల్ నుంచి కుమార్‌ను బైక్‌పై తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి 9 గంటల తరవాత కూడా కుమార్ ఇంటికి చేరుకోకపోవడంతో అతడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలోనే కుమార్ తను ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేశాడు. తాను చింతగుట్ట వద్ద ఉన్నానని తనను చంపేస్తారేమోనని భయంగా ఉందని ఆమెకు చెప్పాడు. వెంటనే అమ్మాయి ఈ విషయాన్ని కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. కుమార్ తండ్రి గడ్డి సారయ్య వెంటనే కుమారుడికి ఫోన్ చేయగా స్విఛాప్ వచ్చింది.సోమవారం ఉదయం సారయ్య శంకరపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన కొడుకు కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. అప్పటి నుండీ అతని ఆచూకీ తెలియకపోగా మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తాడికల్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పత్తి చేనులో గడ్డి కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుమార్ తల్లిదండ్రులు.. కుమారుడి మృతదేహం వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అలాగే అతడి ప్రియురాలు కూడా అక్కడి చేరుకుని బోరున విలపించింది. అయితే తాను సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తన కుమారుడి హత్యకు పోలీసులు కూడా ఒక కారణమని సారయ్య ఆరోపిస్తున్నారు..

Lover Dead In Thadikal Village