2.0 కు భారీ బిజినెస్

Kollywood Films Say That 2.0 Will Be A More Visual Wonder

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషనల్లో సినిమా అంటే దానికి సంబంధించిన ప్రతి అంశమూ వార్తే. గతంలో వారిద్దరి కాంబినేషనల్లో వచ్చిన రోబో సూపర్ సక్సెస్ కావటంతో ఇప్పుడు 2.0 పై కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాదు…దేశవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శంకర్ సినిమా అంటేనే విజువల్ ఎఫెక్ట్స్ వండర్. 2.0 సినిమా మరింత విజువల్ వండర్ కానుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తొలుత ఈ చిత్రాన్ని అక్టోబరు లో విడుదల చేయాలని భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పూర్తికాకపోవటంతో జనవరికి వాయిదా వేశారు. చిత్రానికి ప్రీ బిజినెస్ భారీగా జరుగుతోంది.

తాజాగా హైదరాబాద్, తెలంగాణ పంపిణీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని నిర్మాత రాజు మహాలింగం ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ తో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. మేకింగ్ లో లైకా ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమా కలిస్తే చరిత్రే అని కూడా ఆయన ట్వీట్ ఛేశారు. అటు సినిమా విడుదల మరికాస్త ఆలస్యమయ్యేటట్టు ఉండటంతో డిసెంబరు 12న రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 2.0లో రజనీకాంత్ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇందులో విలన్గా నటిస్తుండటం విశేషం. ఎ. ఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న 2.0 రోబోను మించిన సక్సెస్ అవుతుందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు:

రానా కోపం.. పబ్లిసిటీ స్టంట్‌

‘సరైనోడు’ ఎఫెక్ట్‌తో హిందీలో 7 కోట్లు..!