‘పైసా వసూల్‌’ డిస్ట్రిబ్యూటర్స్‌ ఆందోళ

distributors-were-feeling-n

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రంగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ‘పైసా వసూల్‌’ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న పైసా వసూల్‌ చిత్రాన్ని  డిస్ట్రీబ్యూటర్లు ఎక్కువ మొత్తాలు పెట్టి చాలా నెలల క్రితమే కొనుగోలు చేయడం జరిగింది. సినిమా ప్రారంభం సమయంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా చేస్తున్నన్ని రోజులు పూరిని డ్రగ్స్‌ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కారణంగా పూరి సినిమాను ఎలా చేశాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ముందుగా అనుకున్న దానికంటే నెల రోజుల ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి పూరి అందరికి షాక్‌ ఇచ్చాడు. ఏదైనా సినిమా అనుకున్న సమయంకు లేదా ఆలస్యం అవుతుంది. కాని నెల రోజుల కంటే ముందే షూటింగ్‌ పూర్తి అవ్వడంతో అంతా ఆలోచనల్లో పడ్డారు. ముఖ్యంగా ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన ప్రారంభం అయ్యింది. సినిమా ఎలా ఉంటుందో అంటూ  వారు భయపడుతున్నారు. ఇప్పటికే నిర్మాత టేబుల్‌ ప్రాఫిట్‌ దక్కించుకున్నాడు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రిస్క్‌లో పడ్డారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప తాము పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చే ఛాన్స్‌ లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. పూరి కేసులో ఇరుక్కోవడం, ఛార్మి ఈ సినిమాకు పని చేయడం వంటి కారణాల వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. సెప్టెంబర్‌ 1న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అప్పటి వరకు ఏమైనా పాజిటివ్‌గా రెస్పాన్స్‌ వస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

 ‘నేనే రాజు నేనే మంత్రి’కు భారీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌

పతాంజలి సినిమా రాబోతుందా?

జయ జానకి నాయక ప్రివ్యూ.