కృతి శెట్టి “మనమే” టీజర్ తో అభిమానులను ఆకట్టుకుంది ..!

Kriti Shetty impresses fans with
Kriti Shetty impresses fans with "Maname" teaser..!

టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస మూవీలు చేస్తూ, కెరీర్ లో దూసుకు పోతున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా మనమే. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తోనే అందరిలో ఆసక్తి నెలకొంది. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

 

Kriti Shetty impresses fans with "Maname" teaser..!
Kriti Shetty impresses fans with “Maname” teaser..!

ఈ మూవీ కి సంబందించిన టీజర్ విడుదల పై తాజాగా హీరోయిన్ కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేశారు. మనమే టీజర్ ఇక్కడ ఉంది? డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు, ఇంకా వెయిట్ చెయ్యడం మా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రెస్పాండ్ అయ్యింది. ఇంత క్యూట్ గా అడుగుతున్నారు. ఇచ్చేయండి సార్, త్వరగా టీజర్ డేట్ ఇచ్చేయండి అని అంటూ చెప్పుకొచ్చారు. శర్వానంద్ కెరీర్ లో 35 వ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.