కేటీఆర్ ను ఫిదా చేసిన నేతన్న

KTR Got A Surprise Gift From Siricilla Cloth Workers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

KTR Got A Surprise Gift From Siricilla Cloth Workers

కేటీఆర్ అనగానే అందరికీ ఐటీయే గుర్తొస్తోంది. కానీ ఆయన చేనేత కు కూడా మంత్రిగా ఉన్నారు. నేతన్నల ఖిల్లా సిరిసిల్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న అక్కడ చేసిందేమీ లేదని విమర్శలు వస్తుంటే.. సిరిసిల్ల నేతన్న కేటీఆర్ కు అపురూప కానుక అందించారు. పల్చటి వస్త్రంపై కేటీఆర్ దంపతుల ఫోటోను నేసి.. ఆయన మనసు దోచేశారు.

తెలంగాణ సర్కారులో కేసీఆర్ తలుచుకున్నా కాని పని కూడా కేటీఆర్ అనుకుంటే అయిపోతోందని టాక్ ఉంది. అలాంటి కేటీఆర్ ను బుట్టలో వేస్తే తమ కష్టాలు తీరతాయని సిరిసిల్ల నేతన్న ఈ వస్త్రం బహూకరించారు. ఈ బహుమతి చూడగానే కేటీఆర్ కు పట్టరాని ఆనందం కలిగిందట. కనీసం ఇప్పటికైనా సిరిసిల్ల నేతన్నల బతుకులు మారుస్తారో లేదో చూడాలి.

టెక్స్ టైల్ పార్కుల పేరుతో కేటీఆర్ హడావిడి చేస్తున్నా.. సిరిసిల్లలో ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు. ముఖ్యంగా చేనేత కార్మికుల జీవితాలు మారలేదు. మరమగ్గాలు ఇంకా చాలా మందికి అందుబాటులో లేవు. ప్రభుత్వమే చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తామన్న హామీ ఉత్తుత్తిగానే ఉంది. ఇవన్నీ సాకారం చేయాలని గుర్తుచేయడానికే కేటీఆర్ కు ఈ కానుక ఇచ్చారని సిరిసిల్లలో టాక్.

మరిన్ని వార్తలు:

దీదీని కెలుకుతున్న బీజేపీ

ఉదయం, ఆంధ్రపత్రిక మళ్లొస్తున్నాయా… ఆర్కే స్ఫూర్తి?