ఎట్టకేలకు స్పందించిన మంచు లక్ష్మి

Lakshmi Manchu Tweet About Manchu Vishnu Health.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్‌ సందర్బంగా మలేషియాలో మంచు విష్ణుకు పెద్ద యాక్సిడెంట్‌ అయ్యింది. యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ సందర్బంగా ఈ యాక్సిడెంట్‌ జరిగింది. యాక్సిడెట్‌ సమయంలో హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ కూడా ఆయనతో ఉంది. ప్రగ్యాకు పెద్దగా దెబ్బలు తలగలేదు. కాని మంచు విష్ణు మాత్రం తీవ్రంగా గాయపడ్డట్లుగా చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన ఫ్యామిలీ మాత్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. యాక్సిడెంట్‌ విషయాన్ని నిర్థారించారు. కాని యాక్సిడెంట్‌ తీవ్రతను మాత్రం వారు ఇప్పటి వరకు చెప్పలేదు. తాజాగా మంచు లక్ష్మి ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది.

మంచు లక్ష్మి స్పందిస్తూ.. విష్ణు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బెటర్‌గా ఉందని, నాలుగు నుండి ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతిని తీసుకోవాల్సిందిగా వైధ్యులు సూచించినట్లుగా చెప్పుకొచ్చింది. ఆరు వారాలు అంటే గాయాలు పెద్దగానే అయ్యి ఉంటాయని టాక్‌ వినిపిస్తుంది. మంచు విష్ణు త్వరగా కోలుకోవాలని మంచు వారి అభిమానులు మరియు ఆప్తులు కోరుకుంటున్నారు. మంచు విష్ణు కోసం పూజలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, మనందరి అభిమానం విష్ణును త్వరలోనే మామూలు మనిషిని చేస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. మోహన్‌బాబు ఈ విషయమై స్పందిస్తూ అంతా బాగుంది, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు:

మెగాస్టార్‌ మూవీలో మెగాస్టార్‌?