టాప్‌ చిత్రాల జాబితాలో ఫిదా

Fidaa in Top 10 ten lists at Overseas Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దాంతో భారీగా కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఈ సంవత్సరం విడుదలైన టాప్‌ 10 చిత్రాల జాబితాలో ఇప్పటికే ఫిదా చేరిపోయింది. సాయి పల్లవి తెలంగాణ యాస మరియు ఆమె నటనతో సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక దర్శకుడు శేఖర్‌ కమ్ముల తనదైన స్టైల్‌లో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఓవర్సీస్‌లో ఇప్పటికే మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసిన ‘ఫిదా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది, ఇంకా సాధిస్తూనే ఉంది. రెండవ వారాంతంలో కూడా భారీగా వసూళ్లు రావడంతో నిర్మాత దిల్‌రాజు ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు.

ఓవర్సీస్‌ మరియు నైజాంల తర్వాత ఉత్తరాంధ్రలో కూడా ‘ఫిదా’ మంచి కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తుంది. వరుసగా రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ వద్ద ‘ఫిదా’ సందడి కొనసాగుతుంది. భారీ స్థాయిలో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంతో సినిమా కలెక్షన్స్‌ పరంగా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు అంతటా కలిపి ఈ సినిమా ఏకంగా 50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిందని, 30 కోట్లకు పైగా షేర్‌ను కూడా ఈ చిత్రం రాబట్టిందనే టాక్‌ వినిపిస్తుంది. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లోనే మొదటి సారి ఇంత భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. ఈ చిత్రంతో వరుణ్‌ తేజ్‌ స్థాయి పెరిగి పోయిందని చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు: