లారీ ఢీకొని గర్భిణి మృతి

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణంలో ఘోరం జరిగింది. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చి లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 నెలల గర్బిణి అప్పలనర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.

అయితే కొత్త దంపతులైన ఆ జంటకు 10 నెలల క్రితమే పెళ్లైంది. భార్య గర్భం దాల్చడంతో రెండు కుటుంబాల్లో ఆనందం విల్లివిరిసింది. ఇంతలో ఆ వివాహితురాలు మృతి చెందడంతో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మరికొద్ది నెలల్లోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఆ జంట ముచ్చటపడిన సందర్భంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అందరనీ కలతకు గురిచేస్తుంది. కానీ… లారీ రూపంలో వచ్చిన మృత్యువు భార్య ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా ఎన్‌ఏడీ కొత్తరోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.కాగా కె.కోటపాడు మండలం సూరెడ్డిపాలేనికి చెందిన జంట ఈర్లె అప్పలనర్సమ్మ (24)కు మల్లు నాయుడు.

ఇయితే మల్లునాయుడు పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.