ఉత్తరప్రదేశ్ లో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. అదేమంటే అతనికి మనుషులను చంపడం అంటే మజా అంట. అతను ఓ సైకో. అతడికి మనుషులను చంపడం అంటే ఎంతో ఇష్టం. మనుషులను చంపడంలో ఆ ఆనందమే వేరు.. అందులో మజా ఉందని అంటున్నాడు ఓ సైకో. ఆతడి మాటలు విని పోలీసులు షాక్ కు గురౌతున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి-4న ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలోని ధర్మపుర్ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే ఆరేళ్ల బాలుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. జూన్ 9న అతడి సోదరుడు ప్రశాంత్ కూడా అదే రీతిలో అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. అయితే ఈ కేసులో కొంతమంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జూన్ 11వ తేదీన సత్యేంద్ర, ప్రశాంత్ల చిన్నాన్న రాథే శ్యామ్… సొంత అన్న విశ్వనాథ్ సింగ్ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించాడు.