జనాలను చంపడమంటే నాకు ఇష్టం : సైకో కిల్లర్

ఉత్తరప్రదేశ్ లో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. అదేమంటే అతనికి మనుషులను చంపడం అంటే మజా అంట. అతను ఓ సైకో. అతడికి మనుషులను చంపడం అంటే ఎంతో ఇష్టం. మనుషులను చంపడంలో ఆ ఆనందమే వేరు.. అందులో మజా ఉందని అంటున్నాడు ఓ సైకో. ఆతడి మాటలు విని పోలీసులు షాక్ కు గురౌతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి-4న ఉత్తరప్రదేశ్‌ ఈటా జిల్లాలోని ధర్మపుర్‌ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే ఆరేళ్ల బాలుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. జూన్‌ 9న అతడి సోదరుడు ప్రశాంత్‌ కూడా అదే రీతిలో అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. అయితే ఈ కేసులో కొంతమంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జూన్‌ 11వ తేదీన సత్యేంద్ర, ప్రశాంత్‌ల చిన్నాన్న రాథే శ్యామ్… సొంత అన్న విశ్వనాథ్‌ సింగ్‌ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించాడు.

ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టిన బంధువులు రాథే శ్యామ్‌ను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాథే శ్యామ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలను వెల్లడించారు. సత్యేంద్ర, ప్రశాంత్‌లను తానే చంపానని నేరం ఒప్పేకున్నాడు. అంతేకాకుండా అలా చంపడం అంటే తనకు ఇష్టమని పోలీసులకు షాకింగ్ విషయాలను వెల్లడించాడు ఆ సైకో. అసలు వారిని ఎందుకు చంపావని పోలీసులు ప్రశ్నించారు. అందుకు తనకు మనుషుల్ని చంపడమంటే ఇష్టమని ఏమాత్రం తడుముకోకుండా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా ఇంకో ముగ్గురుని కూడా చంపేందుకు ప్లాన్ చేసినట్లు వివరించారు. దీంతో షాక్ కి గురైన పోలీసులు కేసు నమోదు చేసి అతడి మానసిక పరిస్థితిపై దర్యాప్తు చేస్తున్నారు.