నడి రోడ్డుపైనే వివస్త్రను చేసి ఆపై దారుణం..

తెలంగాణలోని సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అదేమంటే.. ఓ మహిళను తీవ్రంగా కొట్టి.. నడిరోడ్డుపైనే వివస్త్రను చేయడం సంచలనంగా మారింది. కొందరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి ఆమెను రోడ్డుపైనే వదిలేశారు. దీంతో ఆ మహిళ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా లాక్‌డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గ‌ృహహింస కేసులు పెరుగుతున్నాయి. మగవారు ఇళ్లకు పరిమితం కావడం.. ఖాళీగా కూర్చోవడంతో భార్యభర్తల మధ్య మాటకు మాట పెరిగి గొడవలకు దారితీస్తున్నాయి. అయితే జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22 నుంచి ఏప్రిల్ 16 వరకు డయల్ 100కు ఏకంగా 522 ఫిర్యాదులు అందాయి. ఈ కాల్స్‌లో 455 ఫిర్యాదులను టెలీ కౌన్సెలింగ్ నిర్వహించి సమస్యను పరిష్కరించారు. మరో 13 కేసులను షీ టీమ్ పరిధిలోని బృందం పర్యవేక్షిస్తోంది. మరో 9 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులను దర్యాప్తు చేస్తున్నారు.