వారిని ఆదుకోవాలనుకుంటున్న మహేష్‌..!

mahesh babu again do movie with 14 reels

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అను నేను’ చేస్తున్నాడు. ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మహేష్‌, కొరటాల కాంబోలో వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను మహేష్‌ చేసేందుకు కమిట్‌ అయ్యాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు వంశీ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో ఉన్నాడు. డిసెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత 14 రీల్స్‌ బ్యానర్‌లో మహేష్‌ ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

14 రీల్స్‌ నిర్మాతలతో మహేష్‌బాబుకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ బ్యానర్‌లో మహేష్‌ మూడు సినిమాలు చేశాడు. ‘దూకుడు’ సూపర్‌ హిట్‌ అవ్వగా ‘1’ మరియు ‘ఆగడు’ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. దానికి తోడు తాజాగా 14 రీల్స్‌ వారు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘లై’ చిత్రం డిజాస్టర్‌ అయ్యింది. ఆ సినిమా వల్ల దాదాపు 25 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం 14 రీల్స్‌ నిర్మాతలు కష్టాల్లో ఉన్నారు. అందుకే వారిని ఆదుకునేందుకు మహేష్‌బాబు ముందుకు వచ్చాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 14 రీల్స్‌ నిర్మాతలకు మహేష్‌బాబు డేట్లు ఇచ్చాడు. 2019లో 14 రీల్స్‌ బ్యానర్‌లో ఒక చిత్రాన్ని చేసేందుకు మహేష్‌ బాబు కమిట్‌ అయ్యాడు. ప్రస్తుతం మహేష్‌బాబు కోసం సూట్‌ అయ్యే ఒక మంచి దర్శకుడిని 14 రీల్స్‌ వెదికే పనిలో ఉన్నారు. ‘దూకుడు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ను మహేష్‌తో నిర్మించి మరోసారి ఇండస్ట్రీలో 14 రీల్స్‌ స్థాయి ఏంటి అనేది నిరూపించుకోవాలని నిర్మాతలు ఆశ పడుతున్నారు. పవర్‌ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌తో మహేష్‌బాబు, 14 రీల్స్‌ కాంబో మూవీ ఉండే అవకాశం ఉందని సూపర్‌ ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.