ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న మ‌హేశ్…

Mahesh Babu enjoying Paris Trip with family

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భ‌ర‌త్ అను నేను అద్భుత‌విజ‌యాన్ని ఎంత‌గానో ఎంజాయ్ చేస్తున్నాడు మ‌హేశ్ బాబు. సినిమా రిలీజ్ కు ముందు విప‌రీత‌మైన టెన్ష‌న్ అనుభ‌వించిన మ‌హేశ్ ఇప్పుడు ఎంతో రిలీఫ్ ఫీల‌వుతున్నాడు. స‌క్సెస్ ఆనందాన్ని కుటుంబంతో క‌లిసి పంచుకోవ‌డానికి ప్యారిస్ కు విహార‌యాత్ర‌కు వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల‌ను మ‌హేశ్ భార్య‌ న‌మ్ర‌త ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఓ ఫొటోలో మ‌హేశ్ త‌న కూతురు సితార‌ను బుజ్జ‌గిస్తున్నారు. మ‌రో ఫొటోలో సితార త‌న తండ్రికి క‌బుర్లు చెబుతోంది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. భ‌ర‌త్ అను నేను విజ‌యం సంద‌ర్భంగా నమ్ర‌త ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూ సంగ‌తులు కూడా నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆ ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త మ‌హేశ్ కు పిల్ల‌ల‌తో ఉన్న అనుబంధం గురించి వివ‌రించింది.

భ‌ర‌త్ అను నేను విజ‌యం త‌న భర్త‌కు చాలా సంతోషాన్నిచ్చింద‌ని న‌మ్ర‌త చెప్పింది. సితార‌తో డ్యాన్స్ చేయ‌డం మ‌హేశ్ కు చాలా ఇష్ట‌మ‌ని తెలిపింది. కొన్నివారాలుగా ఓ స్టెప్టు వేయాల‌ని తండ్రీకూతుళ్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, కానీ వేయ‌లేక‌పోతున్నార‌ని న‌మ్ర‌త తెలిపింది. త‌మ కుమారుడు గౌత‌మ్ కు అచ్చం తండ్రిలాగే సిగ్గెక్కువ‌ని, డ్యాన్స్ చేయ‌మ‌ని మ‌హేశ్ అత‌న్ని బ‌ల‌వంతం చేస్తుంటాడ‌ని న‌మ్రత చెప్పింది. బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం త‌ర్వాత మ‌హేశ్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో న‌టిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది.