ఈ పుకారే నిజమైతే మైండ్‌ బ్లాంకే!

Mahesh Babu, Ram Charan & NTR multistarrer movie

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఈమద్య చాలా తరుచుగా కలుస్తూ ఉన్నారు. వీరిమద్య మంచి స్నేహం ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా వంశీ పైడిపల్లి బర్త్‌డే సందర్బంగా మరోసారి వీరు ముగ్గురు కలిశారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లతో వంశీ వర్క్‌ చేయగా, ప్రస్తుతం మహేష్‌బాబుతో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ముగ్గురు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడిగా వంశీ గుర్తింపు దక్కించుకున్నాడు.

ఈ సమయంలోనే ఈ ముగ్గురి కలయికలో భారీ మల్టీస్టారర్‌కు వంశీ పైడిపల్లి ప్లాన్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరు స్టార్‌ హీరోలతోనే సినిమా అంటే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ముగ్గురు స్టార్‌ హీరోలు అది కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా అంటే భారీ అంచనాలుండే అవకాశం ఉంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై చాలా చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురు స్టార్‌ హీరోలను కలిపి ఒక ఫొటోలో చూస్తేనే కళ్లు పెద్దవి అవుతాయి. అదే ఒకే సినిమాలో, ఒకే ఫ్రేమ్‌లో నటిస్తూ కనిపిస్తే మాత్రం అద్బుతం అని చెప్పుకోవచ్చు. వందల కోట్లు వసూళ్లు చేయకున్నా కూడా అదో రికార్డుగా నిలిచి పోతుంది. ఈ ఊహ చాలా బాగుంది, కాని వర్కౌట్‌ అయ్యేనా లేదా అనేది మాత్రం చూడాలి. ఒక వేళ ఇదే నిజం అయితే అందరి మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయం.