“ఆడపిల్ల”ని పూడ్చిపెట్టిన తండ్రి

మగ బిడ్డే పుడుతాడాని కచ్చితంగా నమ్మిన ఓ తండ్రి ఆడబిడ్డ పుట్టిందన్న కోపంతో సజీవంగా ఉన్న 17 రోజుల పసికందును పూడ్చిపెట్టాడు. ఈ ఘటన తమిళనాడులో విల్లుపురం జిల్లా అతంద మరుథూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వరదరాజన్ అనే వ్యక్తికి 15 నెలల క్రితం సౌందర్య అనే యువతితో వివాహం అవ్వగా అక్టోబర్ నెలలో పండంటి ఆడబిడ్డ జన్మించింది.

ఆడపిల్ల తనకొద్దని భార్యతో గొడవపదడిన వరదరాజన్ మూడురోజుల వయసున్న శిశువును చంపేందుకు ప్రయత్నించాడు. కాగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో నిన్న రాత్రి చిన్నారిని వరదరాజన్ ఎత్తుకెళ్లి దూరంలో ఉన్న ఎవరు లేని ప్రాంతంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు.

తెల్లవారు జామున మెలకువ వచ్చిన తల్లి పక్కన బిడ్డ లేక పోవడంతో ఆందోళన పడి తనతో పాటు కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వేతకగా వరదరాజన్ వెతకాల్సిన పని లేదని చంపేశానని చెప్పాడు. వరదరాజన్ తనకు మగబిడ్డను కని ఇవ్వమంటే భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, అందుకే చంపేశానని  చెప్పగానే అందరూ షాక్ అవ్వగా అనంతరం తల్లి సౌందర్య ఫిర్యాదుతో ఐపీసీ 302, 315 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని వరదరాజన్ అరెస్ట్ చేశారు